17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మద్యం టెండర్లకు గడువు పెంపు

19-10-2025 01:09 AM

23 వరకు దరఖాస్తుల స్వీకరణ 

-ఇప్పటివరకు వచ్చినవి 85,363 

-ప్రభుత్వ ఖజానాకు రూ.2,560 కోట్ల మేర ఆదాయం

-శనివారం ఒక్కరోజే రూ.1,162 కోట్లు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,650 మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ఉత్తర్వుల ప్రకారం శనివారం చివరి గడువు కాగా, ప్రభుత్వం ఫీజుల ద్వారా ఆశించిన రూ.3 వేల కోట్ల మేర ఆదాయం రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. ఆదివారం సెలవు, సోమవారం దీపావళి తర్వాత మూడు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది.

గత ఉత్తర్వుల ప్రకారం శనివారమే చివరిరోజు కావడంతో ఆశావహులు భారీగా కేంద్రాలకు పోటెత్తారు. ఈ ఒక్కరోజే 50 వేల దరఖాస్తులు వస్తాయని అబ్కారీశాఖ అంచనా వేయ గా, ఆ సంఖ్య 38,754కు చేరకుంది. ప్రభుత్వ ఖజానాకు రూ.1,162 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అలాగే మొత్తంగా 85,363 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ ఖజానాకు రూ.2,560 కోట్ల మేర ఆదాయం వచ్చింది. మొత్తం మద్యం షాపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ (గౌడ్) సామాజిక వర్గాలకు అబ్కారీశాఖ రిజర్వేషన్ల పరంగా దుకాణాలను రిజర్వ్ చేసింది. మిగతా మద్యం దుకాణాలతో పోలిస్తే, రిజర్వ్ అయిన దుకాణాలకు తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది.