25-09-2025 05:18:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని పొందించిన విధానకర్త అని వారి యొక్క ఆశాలను ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు అని నాయకులు తెలుపడం జరిగింది.