27-06-2025 01:17:28 AM
సర్వే నెం.199లో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
తుర్కయంజాల్, జూన్ 26:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. ఇంజాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 199లోని ప్రభుత్వ భూమిలో కొం తమంది వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని విజయక్రాంతి దినపత్రికలో ఇటీవలే కథనం వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కథనాలపై స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదిలేదన్నారు. మరోసారి అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు సహకరించాలని కోరారు.