26-06-2025 12:19:21 AM
మొయినాబాద్ , జూన్ 25:మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 155 లో 1-14 ఎకరాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనురెవెన్యూ అధికారులు తొలగించారు. బుధవారం తహసీల్దార్ గౌతమ్ కుమార్, గిర్దవర్ రాజేష్ , రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ (ఫ్రీ కాస్ట్ వాల్), ఇనుప గేట్ ను జేసీబీ సహాయంతో కూల్చివేశారు.
అనంతరం అక్కడ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..బాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. మండల పరిధిలోని ప్రభుత్వ భూము లు కబ్జాల నుండి రక్షించుటకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ ఆదేశాల మేరకు త్వరలో ప్ఫెన్సింగ్ , సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామనితెలిపారు.