calender_icon.png 26 June, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి

26-06-2025 12:18:49 AM

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కిచెన్‌లో మెనూ ప్రకారం భోజనం శుచికరంగా తయారు చేయాలి

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూన్ 25 (విజయ క్రాంతి):మెరుగైన సేవలతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మ కం పెం చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జిల్లా కలెక్టర్, బుధవారం ఉదయం జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్స్, డయాలసిస్ వార్డు, ఫార్మసీ స్టోర్, జనరల్ వార్డు, కిచెన్ లను తనిఖీ చేసి, ఆసుపత్రిలోని రోగులతో క లెక్టర్ మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పురుషుల మెడికల్ వార్డు లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు, ఏ ఇబ్బం దితో ఆసుపత్రికి వచ్చింది, డాక్టర్లు చూశా రా, మందులు ఇచ్చారా, పరీక్షలు చేస్తున్నారా, నర్సులు, సిబ్బంది సేవలపై రోగులను అడిగి కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మనం మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

ఆసుపత్రి ప్రాంగణం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ద్యం అంశంలో ఎటువంటి లోటుపాట్లు ఉండటానికి వీలు లేదని, అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రైవేట్ ఆస్పత్రులకు ఎటువంటి పరీక్షల నిమిత్తం రాయవద్దని కలెక్టర్ తెలిపారు.ఈ ఆకస్మిక తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. బి. కిరణ్ కుమార్, ఆర్‌ఎంఓ డా. రాంప్రసాద్, డా. రాంబాబు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.