01-06-2025 04:02:59 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న
నూతనకల్,(విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి సామాన్య వ్యక్తిగా నిరాడంబరం జీవితం గడుపుతూ నిత్యం రైతుగా ఉంటూ ప్రజా సమస్యలను తెలిసిన నాయకులుగా రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంత్రి పదవికి అర్హుడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు దరిపెల్లి వీరన్న అన్నారు.
ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గంలో 1400 కోట్లతో అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపిన ఎమ్మెల్యే సామెల్ సామెల్ కు అవకాశం కల్పించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గం పుట్టిన కానుండి ఎమ్మెల్యేకు రాణి మెజార్టీ 51 వేల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఫ్యామిలీ గారికి అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిగ సామాజిక వర్గంలో మందుల ఎమ్మెల్యే మందుల సామేలుకు అవకాశం ఇస్తే జిల్లాలో ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అధిష్టానాన్ని కోరుతున్నారు.