27 June, 2026 | 7:06 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

గ్రామాల్లో ప్రజా పాలన తోనే అభివృద్ధి సాధ్యం

08-12-2025 08:15 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

ఎమ్మెల్యే సామేలు, సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో చేరిక

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఎఐసిసి  నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలల్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సహకారంతో నేడు గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు పేద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు, సర్పంచ్ అభ్యర్థి బొంకూరి సుదర్శన్, పెండెం రామ్మూర్తి, కొండరాజు, అజయ్ కుమార్, తల్లాడ కేదారి, తదితరులు పాల్గొన్నారు.