కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ల పదేళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. రెండు పార్టీలు ప్రజలను లూటీ చేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ గెలిస్తే ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని.. రాహుల్ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ఏ మాత్రం అభివృద్ధి జరగదని, ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డిపేటకు చెందిన సుమారు 150 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, రామారెడ్డి జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, నాయకులు నర్సా గౌడ్, మహేందర్ రెడ్డి, నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నౌసిలాల్, శిలాసాగర్, నర్సింహా రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.