కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలి

22-04-2024 01:43:58 AM

కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు సూచించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో సదాశివనగర్ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త 60 ఓట్లు వేయించేలా కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతమంది ఓటర్లరు కలిశారో అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకు రావాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు లింగా గౌడ్, సంగారెడ్డి, లక్ష్మీపతి, సంపత్ గౌడ్, అన్వేష్ గౌడ్, ఇర్షాద్, శ్రీధర్, సాధక్ అలీ, అజీం పాల్గొన్నారు.