03-06-2025 12:22:17 AM
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి
రాజాపూర్, జూన్ 2: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనే య స్వామి విగ్రహ పున: ప్రతిష్ట, ద్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జడ్చ ర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవానుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి దైవభక్తి ఉండాలని సూచించారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడు క ట్టుబడి ఉందని తెలియజేశారు. అనంతరం గ్రామంలో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన కు టుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.