l ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19, 20వ వార్డుల్లో, గాంధీచౌక్లోని కూరగాయల సంతలో ఎమ్మెల్యే ప్రచా రం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మల్లు రవిని భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో మున్సి పల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.