ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లు అండగా ఉంటా

29-04-2024 01:35:08 AM

మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మీరు ఒక్కరోజు కేటాయించి ఓటు వేసి గెలిపిస్తే ఐదే ళ్లు అండగా ఉంటానని మహబూబ్‌నగర్ పార్లమెం ట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఆమె ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఓటర్లను కలిసి మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే పోటీ చేస్తున్నానని.. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి దేశ రక్షణ తో పాటు అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు.  రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ప్రజలకు కష్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మ కూడదని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం ప్రతి క్షణం పరితపిస్తుంటారని అన్నారు. దేశంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేని పనులను ప్రధాని మోదీ కేవలం పదేళ్లలోనే  చేసి చూపించారని వివరించారు.