20 April, 2026 | 12:56 AM

గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువు

08-12-2024 11:37 PM

నది ఒడ్డున మరుగుదొడ్లు లేక.. బట్టలు మార్చుకునేందుకు షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న మహిళలు

మంథని (విజయక్రాంతి): మంథనిలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గోదారికి నిత్యం వందలు, వేల సంఖ్యలో స్నానాలకు వచ్చే భక్తులు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది ఒడ్డున మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు బట్టలు మార్చుకునేందుకు షెడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి మంథని పట్టణంలో నుంచి, మండలంలో నుండే కాకుండా ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లోని ప్రజలు, పెద్దపల్లి జిల్లాలోని తదితర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి స్నానాలకు మంథనికి వస్తుంటారు. అయినప్పటికీ అధికారులు మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయకపోవడంపై మహిళలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గోదావరి నది ఒడ్డున భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు మహిళలు బట్టలు మార్చుకునేందుకు షెడ్లను ఏర్పాటు చేసి భక్తుల కష్టాలు తీర్చాలని భక్తులను కోరుతున్నారు.