20 April, 2026 | 2:45 AM

విదేశీ పర్యటకలు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించండి

08-12-2024 11:41 PM

కలెక్టర్ జితేష్ వి పాటిల్...

భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి దేశ, విదేశాల నుండి భక్తులతో పాటు టూరిస్టులు అధికంగా వస్తుంటారని, వారికి గిరిజన ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం, ఆదివాసి వంటకాల నిర్వహణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం నాడు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలో నిర్మాణం చేపడుతున్న గడ్డి ఇండ్లను, టూరిస్టులకు ఆదివాసి వంటకాలు, కోయ కల్చర్కు సంబంధించిన వస్తువులు అందించే స్టాల్స్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ట్రైబల్ కల్చర్ ఉట్టిపడేలా అన్ని హంగులతో తయారు చేయాలని అన్నారు. అదేవిధంగా విదేశీ పర్యటకులు రాత్రిపూట బస చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.