భక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
28-03-2026 12:25 AM
జడ్చర్ల, మార్చి 27 : భక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గం వైపు నడిపిస్తుందని మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జడ్చర్ల పట్టణంలో వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
శ్రీ సీతారాముల వారిని దర్శించుకొని ..అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.




