బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని నిరసిస్తూ 4న ధర్నా
02-12-2024 09:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈనెల 4న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కోటగిరి గోపి అన్నారు. సోమవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంస్థల నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






