11 April, 2026 | 12:18 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

ధృవ్ జురెల్ మరో సెంచరీ

09-11-2025 12:00 AM

బెంగళూరు, నవంబర్ 8 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలతో దు మ్మురేపుతున్నాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జురెల్ తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో నూ శతక్కొట్టాడు. జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్లతో శతకం సాధించాడు.

హర్ష్ దూబేతోనూ, తర్వాత కెప్టెన్ పంత్‌తోనూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీస్కోరు అందించాడు. జురెల్ 127 (15 ఫోర్లు, 1 సిక్సర్) రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. భారత్ ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 382/7 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో 416 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతా ఫ్రికా ఏ జట్టు మూడోరోజు ఆటముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 25 రన్స్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టును గెలిచిన భారత్ ఏ బౌలర్లు చివరి రోజు చెలరేగితే సిరీస్‌ను స్వీప్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.