calender_icon.png 25 October, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా?

22-01-2025 12:00:00 AM

పదేళ్లపాటు కుటుంబ నిరంకుశ దోపిడీ పాలన ద్వారా వివిధ సా మాజిక వర్గాలను అణచివేతకు గురిచేసి అ ధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం కుటుంబ సభ్యులు, వారి అ నుచరులు ఇటీవలి కాలంలో వెనుకబడిన కులాల పట్ల అపారమైన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఒక్క కుటుంబమే అన్ని ముఖ్య పద వులు అనుభవించి ప్రజల అభివృద్ధి రంగాలను ముఖ్యంగా విద్య వైద్య ఉపాధి వ్యవ స్థలను విధ్వంసం చేసిన ఘన కీర్తి వారిది.

మేల్కొంటున్న బీసీ వర్గాలు

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ముందు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం  సమగ్ర కులగణన చేస్తున్న విషయం  తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షం  బీఆర్‌ఎస్, దాని అధినాయకత్వం తమ పూర్తి మద్దతు తెలుపుతారని ప్రజలు  ఆశించారు.

మరో జాతీ య పారీ ్టబీజేపీ జనాభా లెక్కలే చేయని సందర్భంలో ఇక కులగణన ప్రక్రియను సమర్థిస్తుందని ఎవరూ ఆశించలేరు. పైపె చ్చు కులగణనద్వారా సమాజం విడిపోతుందని శాస్త్రీయమైన సమస్యలను ప్రకటిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు చెందిన వెనుకబడిన కులా ల నాయకులు ఇటీవల అక్కడక్కడ సభలు నిర్వహించి తమ గళం విప్పి బీసీలకు తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేయడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ నాయకులు మాట్లాడడానికి అధినాయకత్వం అనుమతి పొందారో లేదో తెలియదు. కేసీఆర్ పాలనలో తమ సహజమైన ధోరణిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎలాంటి ఆసక్తి చూపని పరిస్థితిని ఆ వర్గా ల వారు అనుభవించారు, నష్టపోయారు. ఇంకా గత అనుభవాలను మర్చిపోలేదు.

రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం కూడా లేని ఒక సామాజిక వర్గం నుండి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకత్వం వారి కుటుంబ పాలనలో 52 శాతం ఉన్న ప్రజలను అన్ని రంగాలలో అణచివేసి వారిఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిని అడ్డుకోవడం జరిగిందని చెప్పడానికి అనేక ప్రత్యక్ష, పరోక్ష  సాక్ష్యాధారాలు ఏకరువు పెట్టవచ్చు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడిన కులా ల వారికి ఒరిగిందేమి లేదని అన్ని పార్టీలకు, వారి నాయకులకు తెలిసిందే. తమకు జరుగుతున్న అన్యాయం బాధిత ప్రజలకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నందుకు సం తోషించాలి. దానికి సంబంధించిన చర్చలు కూడా ఈ వర్గాలలో ముమ్మరంగా జరుగుతున్నాయి.

గత ఏడున్నర దశాబ్దాలుగా పా లకులు ఓట్లను రాబట్టుకోవడానికి రక రకా ల ఎత్తుగడలను, డబ్బు, మద్యం పంపిణీ మొదలగు ప్రలోభాలు సంపూర్ణంగా ఉపయోగించి అధికారాన్ని చెలాయించారు. ప్రలోభాలకు సంబంధించి అన్ని ప్రయోగాలు అంతిమ దశకు చేరుకున్నాయి. ఇక ముందు వెనుకబడిన కులాల ప్రజల ఓట్లే లక్ష్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఆర్‌ఎస్‌కు బహుజన వర్గాల ఓట్లు లేకుండా అధికారం చేపట్టడం సా ధ్యం కాదని తేలిపోయింది.

అందుకే ఇప్పు డు వెనుకబడిన కులాల సామాజిక న్యా యం కల్వకుంట్ల కుటుంబానికి అవసరమైనట్లుంది. వెనుకబడిన కులాల ప్రజల్లో ఇప్పుడిప్పుడే  తమకు జరుగుతున్న అన్యాయం గురించిన చైతన్య పూరితమైన చర్చలు ప్రారంభమైనాయి. అందుకే ఇప్పు డు అన్ని పార్టీలకు అధికారం పొందడానికి బీసీల ఓట్లు ఏదో ఒక విధంగా సాధించడం తప్పనిసరిగా మారింది. 

చేదుమాత్రగా కులగణన

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కులగణ న, బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఆ ర్థిక సామాజిక అభివృద్ధి నినాదంతో ఎన్నికల ప్రచారం సాగించింది. ఈ నినాదం బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీకి కూడా మింగు డు పడని చేదు మాత్రగా పరిణామం చెం దవచ్చు. సామాజిక న్యాయం తమ లక్ష్యం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన నిజాయితీని నిరూపించుకోవలసిన అవసరం ఉంది. 

కులగణన మాత్రమే సామా జిక న్యాయం సమకూర్చదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రభుత్వ వ్యవస్థలలో తగిన విధంగా అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే అది సాధ్యం. ఇక రాష్ట్రంలో పూ ర్తిగా కుటుంబ ఆధిపత్యంలో నడుస్తున్న ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు కులగణన, బహుజన వర్గాల రాజకీయ సాధికారిత అస్సలే గిట్టని విషయం.

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకత్వం ఈ సామాజిక వర్గాన్ని మరోసారి మభ్య పెట్టడానికి తమ పార్టీకి సంబంధించిన ఈ వ ర్గాల నాయకులను, ఎమ్మెల్సీలను రంగం లో దించి ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, అణచివేతల గురించి విస్తృతంగా చర్చలు, సభలు నిర్వహించడం ప్రజలను ఆశ్చర్య పరుస్తున్నది. 

అడుగడుగునా అన్యాయమే

పదేళ్ల పాటు అణచివేతను అనుభవించిన బీసీ వర్గాల విద్యార్థులు, యువత, ఇత ర నాయకులు ఇంకా మర్చిపోనేలేదు.  తె లంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెరాసను తన సొంత ఇంటి పార్టీగా ప్రకటించుకున్నారు. దళితులకు ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవి తానే తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని కూడా తనవద్దే ఉంచుకున్నారు.

అదనంగా ఏ అనుభవం లేని  కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. తన కొడుకుతో సహా మేనల్లుడిని, సహచర బంధువును క్యాబినెట్ లో చేర్చుకొని అత్యంత కీలకమైన పదవులు అప్పగించారు. బడుగు, బలహీన వర్గాల లో అనేకమంది మేధావులు, రాజకీయ నా యకులు ఉన్నప్పటికీ కొసరు పదవులతో బుజ్జగించారు.

నాలుగు లక్షల మంది ఉ ద్యోగులను ఉపయోగించి ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ప్రజలకు అనేక ఆశలు కల్పించారుకానీ ఆ నివేదికను తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకున్న ఘన చరిత్ర వారిది.  స్థాని క సంస్థలలోనైనా అ ప్పటికి ఉన్న 33 రిజర్వేషన్లను బీసీ ప్రజల కు దక్కకుండా చేసి 22 శాతానికి తగ్గించడం జరిగింది. 

బీఆర్‌ఎస్ పాలనలో బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పథ కం అమలు చేయకుండా చేసి లక్షలాది వి ద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక విద్యను దూ రం చేశారు. బీసీ ప్రభుత్వ ఫైనాన్స్ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా రుణాల కొరకు దరఖాస్తు చే సుకున్న ఐదు లక్షల మంది  నిరుద్యోగ యువతకు నిరాశే మిగిల్చారు.

తన సామాజిక వర్గాలకు, బంధువులకు అత్యధిక సంఖ్యలో ఉన్నత పదవులు, వేలకోట్ల నిధు లు కేటాయించి వారి రుణం తీర్చుకున్నారు. కానీ తెలంగాణ కొరకు త్యాగాలు చేసిన బహుజన వర్గాల యువత, ప్రజలను తమ సహ జధోరణిలో అణచి వేయడం జరిగిందని గమనించిన ఓటర్లు ఇటీవలి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. 

ప్రస్తుతం  తిరిగి అధికారం పొందడానికి అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాలను ప్రసన్నం చేసుకుని ఓట్లను సమీకరించుకోవడానికి తనకుటుంబ సభ్యుల ను, మరికొంతమంది నాయకులను రం గంలో దించి ప్రజలను నమ్మించే ప్రయ త్నం మొదలుపెట్టారు. ఇకముందు జరిగే సాధారణ ఎన్నికలు సామాజిక న్యాయం తో పాటు వివిధ పార్టీల ఆచరణాత్మక వైఖరి, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని  స్పందించాల్సిన సమయం ఆసన్న మైందని వేరే చెప్పనవసరం లేదు.

బీఆర్‌ఎస్ బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని కొత్త నినాదంతో వస్తే  నమ్మే పరిస్థితులు లేవు.  చైత న్యవంతులైన బడుగు, బలహీన వర్గాల ప్రజలు, యువత,నిరుద్యోగులు, మేధావు లు ఇలాంటి శక్తుల పట్ల ఇప్పుడైనా మెలకువతో ఉండాల్సిన అవసరం గుర్తించాలి.