04-02-2026 12:23:29 AM
మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్
మెదక్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 31 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ పార్టీ అభ్యర్థుల తరపున అధికారులకు బీఫాంలను మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ టిక్కెట్లు కేటాయించినట్లు వివరించారు.
మున్నూరు కాపు , ముస్లింలకు 4, ముదిరాజ్, ఎస్సీ ( మాదిగ) లకు 3, లింగాయత్, గౌడ్స్ , వంజరి కులస్తులకు 2 చొప్పున టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. వీరితోపాటు ఎస్సీ (మాల), పూసల, యాదవ్, బుడగ జంగం, ఎరుకల, ఆర్య క్షత్రియ, కుంచెఎరుకల, క్రిస్టియన్, చాకలి, పద్మశాలి, మేర కులస్తులకు ఒకటి చొప్పున టికెట్టు బి ఫామ్ లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి తదితరులు ఉన్నారు.