భూ నిర్వాసితులకు పరిహారం చెక్కుల పంపిణీ
06-08-2026 01:38 AM
మేడ్చల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నుండి శామీర్పేట్ వరకు ఎలివే టెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన అల్వాల్ భూయజమానులకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. 2264 చదరపు గజాల స్థ లాన్ని ఇచ్చిన భూయాజమానులకు రూ.33 కోట్ల చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా ప్రత్యేక భూసేకరణ అధికారి మా లతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగం గా అల్వాల్లోని స్థలానికి సంబంధించి ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను , త ప్పుడు ఆరోపణలను ఖండించారు. చట్టబద్ధమైన ప్రక్రియలు, రికార్డులను పక్కనబెట్టి, స ర్వే నంబరు 168 భూమి పై ఎలాంటి ఆధారా లు లేకుండా నిరాధార వార్తలను ప్రజలకు చేరవేయకూడదని అన్నారు.






