విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ప్యాడ్ల పంపిణీ
సుల్తానాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ అందించారు. బుధవారం పట్టణంలోని.. జెడ్ పి ఎస్ ఎస్ బాలుర మరియు బాలికల అలాగే. జి జె సి హై స్కూల్ సుల్తానాబాద్ నందు పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంగా సంస్థలు అన్ని విధాల అండగా ఉంటున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు.. బుర్ర ఓంకార్ గౌడ్. కోశాధికారి తుమ్మ వెంకటేశం. . ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్. దేవసాని సన్నీ. శ్రీనివాస్. ఎల్లా మల్లేశం. ప్రధానోపాధ్యాయులు. పద్మశ్రీ.. టి దివాకర్ రావు. S .రత్నాకర్ రెడ్డి. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..




