13-06-2025 12:00:39 AM
బెల్లంపల్లి అర్బన్, జూన్ 12 : బెల్లంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘo కార్యాలయంలో సహకార సంఘ ఛైర్మెన్ చింతం స్వామితో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి కల్పన జీలుగ విత్తనాలను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడు తూ మండలానికి 333 జీలుగ విత్తనాలు వచ్చాయని, 30 కిలోల బస్తా ధర రూ. 2138, కాగా ఇది సబ్సిడీ ధర అని, వరి వేసే రైతులు జీలుగ వేసుకోవాలని, ఒక బస్తా 2, 3 ఎకరాలకు వేసుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మండలం వ్యవ సాయ అధికారి ప్రేమ్ కుమార్, ఏఈఓలు శ్రీనివాస్, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.