8 April, 2026 | 2:21 AM

నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

08-04-2026 12:00 AM

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముం దుకెల్తోందని వనపర్తి శాసనసభ్యులు  మే ఘారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన కళ్యాణ్ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పా ల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నిరుపేదల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడుతుందన్నారు.

ఒక్కో ఇం దిరమ్మ ఇంటి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు చెల్లించి వారి సొంతింటి కల నెరవే రుస్తుందని దాంతో ఎన్నో ఏళ్లుగా సొంత ఇ ల్లు లేక నానా ఇబ్బందులు పడిన నిరుపేదలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొంత గూడు ఏర్పాటు చేసుకున్నామని ఆ నందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపా రు. అలాగే రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు ఇచ్చి వారికి సన్న బియ్యం పం పిణీ చేస్తూ నిరుపేదల ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని 8 మండలాలు, రెండు మున్సిపా లిటీలకు సంబంధించి 178 మంది కళ్యాణ ల క్ష్మి షాది ముబా రక్ లబ్ధిదారులకు ఆయన ఒక లక్ష 16 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చె క్కులు పొందిన లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కా ర్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, అధికారు లు ఆయా మండలాల కాం గ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. వనపర్తి పట్టిన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు