15 April, 2026 | 6:10 PM

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

15-04-2026 04:17 PM

 ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): అర్హులందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 132 మంది లబ్ధిదారులకు, రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.