20 March, 2026 | 10:14 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కేసీఆర్ ఆలోచనే కళ్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

14-01-2026 05:00 PM

జైనూర్,(విజయక్రాంతి): పేదంటి ఆడబిడ్డల కు పెళ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సిర్పూర్ యు, జైనూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైందని ఆరోపించారు. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వడంలేదని విమర్శించారు. గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చాక విమర్శించాలని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పథకాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జైనూర్ సర్పంచ్ కడప ప్రకాష్, బిఆర్ఎస్ పార్టీ మండల ఆద్యుక్షుడు ఇంతియాజ్ లాలా,  ఉప ఆద్యుక్షుడు ఆత్రం శంకర్ , నాయకులు జాధవ్ శ్రవణ్,  సతీష్, కేంద్ర విశాల్ తదితరులు పాల్గొన్నారు