04-06-2025 09:20:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాభివృద్ధి కోసం రూపొందించిన పెసర, వరి విత్తన మినీ కిట్లను మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలంలో అభ్యుదయ రైతులకు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాస్త్రవేత్తల సలహా సూచనలతో మినీ కిట్లలో విత్తనాలు సాగు చేసి, దిగుబడి అనంతరం వచ్చే సీజన్లో రైతులకు స్థానికంగా తక్కువ ధరకు విత్తనం అందజేయాలని, దీనివల్ల మేలైన విత్తనం స్థానికంగానే రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకన్న, సొసైటీల వైస్ చైర్మన్లు అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, ఏ ఈ ఓ లు రాజేందర్, శ్రీనివాస్, సాయి చరణ్, రవివర్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.