calender_icon.png 13 June, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే

11-06-2025 12:45:35 AM

టేకులపల్లి, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మండల వ్యాప్తంగా ఎంపికైన 836 మంది లబ్దిదారులకు టేకులపల్లి మండల కేంద్రంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇల్లందు నియోజకవర్గ శాస నసభ్యులు కోరం.

కనకయ్య పట్టాలు (ప్రొసీడింగ్స్) మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన ప్రతీ ఒక్క లబ్దిదారుడు ప్రభుత్వం ఇచ్చిన, నమూనా ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని, ఇండ్లు లేని నిరుపేదలకు, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రజలకు, విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి, ఇల్లు అందేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారన్నారు.

మొదటి విడతలో ఎంపిక కానివారు, ఎవ రూ నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతీ ఒక్కరికి, విడతల వారీగా ఇండ్లు మంజూరు చేయిస్తామని, వారు హామీ ఇవ్వటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 200 యూ నిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 500 రూపాయలకే వంట గ్యాస్, ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీ లతో తోపాటు అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ లంకపల్లి. వీరభద్రం , ఇంచార్జ్ ఎంపీడీవో  గాంధీ , హౌసింగ్ డిఇ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మార్కెట్ కమిటీ చై ర్మన్ రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పో శాలు, ఇస్లావత్. రెడ్యానాయక్, భద్రు, శంకర్, ధర్మయ్య, లక్కినేని శ్యామ్, మధురెడ్డి, బానోత్ సరోజినీ, బొడ్డు అశోక్, ఊళ్ళోజి ఉదయ్, హనుమంతు, లబ్దిదారులు పాల్గొన్నారు.