calender_icon.png 14 June, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతడే ఓ సైన్యం!

11-06-2025 12:45:16 AM

  1. కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడ్డ శ్రీనుబాబు
  2. గుర్తించి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన అధిష్టానం

మంథని, జూన్ 10 (విజయ క్రాంతి) మంథని నియోజక వర్గంలోనే కాదు... ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో తాను ఒక సైనికుడులా... కార్యకర్తలా కాంగ్రెస్ పార్టీ బలోపే తం కోసం కష్టపడ్డాడు. తన కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటూ తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసిన, ఆయన మరణ అనంతరం అన్న శ్రీధర్ బాబు గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో రా ణిస్తూ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి గా కొనసాగుతున్న...

ఎ లాంటి గర్వం, అహంకారం, లేకుండా ఒక సామాన్య కార్యకర్తల, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతూ మ హిళలకు అన్నల, తమ్ముడిలా, ఒక కొడుకు లా... సామాన్యుడిలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ... మంథని నియోజక వర్గంలో అన్న శ్రీధర్ బాబు గెలుపులో లక్ష్మణునిలా...

భాగమై కష్టపడ్డ తమ్ముడే దుద్దిళ్ల శ్రీను బాబు... శ్రీను బాబు సేవలను స్వ యంగా గుర్తించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల అన్నకు త గ్గ తమ్ముడిగా శ్రీను బాబు కు గుర్తింపు లభించింది. 

పదవులు ముఖ్యం కాదు.. ప్రజాసేవలో మా కుటుంబం పనిచేస్తుంది: పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

తమకు పదవులు ముఖ్యం కాదని,ప్రజాసేవలోనే తమ కుటుంబం పనిచేస్తుందని టీ. పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. తమకు పదవులు కొత్త కాదని, తమ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉందని, ఇక కూడా ఉంటుందని, మంథని నియోజక వర్గ ప్రజల ఆశీ ర్వాదాలు తమ కుటుంబానికి శ్రీరామరక్ష అని శ్రీనుబాబు అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు ఇస్తుందని, పార్టీలో నిరంతరం కష్టపడుతున్న వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనుబాబు తెలిపారు. మంథని నియోజకవర్గంలో కాకుం డా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూడా మరిం త బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని, అధిష్టానం నాపై పెట్టుకున్న నమ్మకం వ మ్ము చేయకుండా తన వంతుగా కష్టపడతానని శ్రీను బాబు తెలిపారు.

తన నియమాగా నికి కృషి చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి మం థని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు తన దైవం అయిన అన్న శ్రీధర్ బాబుకు శ్రీనుబాబు ధన్యవాదాలు తెలిపా రు. శ్రీనుబాబు నియామకంతో మంథని ని యోజకవర్గం లోనే కాకుండా జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.