calender_icon.png 30 June, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో మీ సేవా కేంద్రాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి

27-05-2025 05:18:48 PM

ప్రతి మీసేవా కేంద్రంలో సిటిజన్ చార్టర్ ఏర్పాటు..

మీ సేవా కేంద్రాల నిర్వహణ పై సమీక్ష లో జిల్లా అదనపు కలెక్టర్ వేణు..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో మీ సేవా కేంద్రాలను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు(District Additional Collector Venu) తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టరేట్ లో మీ సేవా కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులు, మీ సేవా కేంద్రాల ఆపరేటర్లతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం మీ సేవ కేంద్రాలలో అవసరమైన పెయింటింగ్, అందిస్తున్న సేవలను వివరించేలా నోటీస్ బోర్డు వివరాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇతర ముఖ్యమైన పత్రాల జారీ అంశంలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా విధులు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మీసేవా కేంద్రాల నిర్వహణ పట్ల ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే తహసిల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరైనా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించవచ్చన్నారు.

మీసేవా కేంద్రంలో ప్రతి సర్వీసు కు ఎంత చెల్లించాలి, ఎన్ని రోజులలో సర్టిఫికెట్ జారీ అవుతుందో వివరాలతో సిటిజెన్ చార్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మీ సేవా కేంద్ర నిర్వాహకులు సరిగ్గా పని చేస్తే ప్రజలలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రజల నుంచి సిటిజన్ చార్టర్ లో పేర్కొన్న మేరకు మాత్రమే నగదును తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈడిఎం కవిత, మీ సేవా జిల్లా మేనేజర్ విద్యా సాగర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.