25-07-2025 05:36:26 PM
కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు
అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
అందుబాటులో ఎరువులు, పుకార్లు నమ్మొద్దు
జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా వ్యవసాయా అధికారి ఛత్రు నాయక్ ఆకస్మికంగా తనిఖీలకు దిగారు. బెల్లంపల్లి పట్టణం లోని పలు ఎరువుల దుకాణలను ఏ డి ఏ రాజానరేందర్, ఏవో ప్రేమ్ కుమార్ ల తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల నిలువలు, అమ్మకం వివరాలు పరిశీలించారు.
డీలర్స్ ఎవరైనా కృత్రిమ కొరత స్ట్రష్టించినా, ఎంఆర్పీ కంటే అధికంగా వాసులు చేసినా లైసెన్స్లు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. యూరియా ను జిల్లా దాటిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులేవరూ పుకారులు నమ్మి ముందుగానే అధికంగా కొని పెట్టుకోవద్దని తెలిపారు. యూరియా విడతల వారీగా మండలాలకు వస్తుందని, రైతులు కూడా విడతల వారీగా కొనుగోలు చేసుకోవాలని కోరారు. విడతలవారీగా రైతులు వినియోగించుకోవాలని వెల్లడించారు. యూరియా కొరత లేదని అందరు సంయమనం పాటించాలని కోరారు.