17-06-2025 05:39:13 PM
పాల్గొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ సోమిరెడ్డి..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి(Congress Party District Leader Gudipalli Madhukar Reddy) జన్మదిన వేడుకలు మంగళవారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ బీరవోలు సోమిరెడ్డి(Former District DCCB Chairman Beeravolu Somireddy) హాజరై కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మందుల సూర్యకిరణ్,సామ అభిషేక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, నాయకులు ఎల్పోజు నరేష్, వేల్పుల రమేష్, దలువాయి రేఖ శ్రీధర్, భైరబోయిన మహారాజు, ఎడ్ల సైదులు, పిట్టల సైదులు, బంటు యాదగిరి, దాసరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.