06-08-2025 01:47:27 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకనభావముందని, చట్టసభలు, న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థలంటే గౌరవం, నమ్మకం లేద ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సార థ్యంలో నియమించిన జ్యుడీషియల్ కమిషన్ అంటే వారికి లెక్కలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని, ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా హరీశ్రావు డూప్ ప్రెజెంటేషన్ మరోసారి ఇచ్చారన్నారు.
తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పుకోవాలనే సోయి కూడా వారికి లేకపోయిం దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంగళ వారం మంత్రి ఒక ప్రకటనను విడుదల చేశా రు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్ఏ మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదని, మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసి ఘోష్ను అవమానిస్తున్నారా..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజె క్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు.. అక్రమాలకు పాల్పడిందో జ్యుడిషియ ల్ కమిషన్ విచారణలో బయటపడిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనా టి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు భండారం బట్టబయలైందని, అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని ఆయన విమర్శించారు.
జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని, అది రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్రావు మరిచిపోయినట్లున్నారన్నారు. ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచార ణ జరిపిందన్నారు. ఎవరెవరు తప్పులు చేశా రో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను కూడా ఈ నివేదికలో వెల్లడించిందని పేర్కొన్నారు.
ఎన్నిసార్లు మోసం చేస్తారు..
తాము తప్పు చేయలేదని మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని ఆయన నిలదీశారు. అప్పటి సీఎం కేసీఆర్, ఆనాడు మంత్రిగా ఉన్న హరీశ్రావును కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించిందని, వారిద్దరు స్వయంగా జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారని, ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్రావు.. ఆరోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు..? అని నిలదీశారు.
హరీశ్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయని, ఆయన చేసిన తప్పులన్ని బయటపడ్డాయని, జ్యుడిషియల్ కమిషన్ విచారణలో కేసీఆర్ పాత్ర ఏమిటో.. హరీశ్రావు చేసిన ఘనకార్యాలేమిటో తేలిపోయిం దన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని, అందుకే.. పార్టీ ఆఫీసుకు వచ్చి ఏకంగా జ్యుడిషియల్ కమిషన్ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్దమైన కమిషన్కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లిందన్నారు.
యాక్టింగ్ ఇకనైనా ఆపాలి..
కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యు లు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. ఫాం హౌస్లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలని చురకలంటించారు. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలని సూచించారు. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా? అని హరీశ్రావును ప్రశ్నించారు.
కమీషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్లపాటు మోసం చేశారని, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారని, నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణం వద్దని చెపితే దాన్నీ తొక్కిపెట్టారు.. బ్యారేజీలు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారని వెల్లడించారు. కుంగి పోయే ప్రాజెక్ట్ కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి, అది తమ గొప్పతనమని జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారన్నారు.
నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్కు ఉమ్మడి రాష్ర్టంలోనే జీవో ఇచ్చారని, తమ ప్రభుత్వం ఒక్క రూపా యి బిల్లు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదని, భూసేకరణ పూర్తి కాకుండా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకూడదని తమ ముఖ్యమంత్రి స్పష్టమైన అదేశాలు జారీ చేశారన్నారు.
చివరకు కేబినేట్ ఆమోదం లేకుండానే మామ అల్లుళ్లు (కేసీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) సంతకాలు చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. తెలంగాణ ప్రజలను దగా చేశారని, తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా రూ.లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ లీడర్లకు నైతికంగా మాట్లాడే హక్కు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.