calender_icon.png 24 February, 2026 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలికి డాక్టరేట్

24-02-2026 12:00:00 AM

మెదక్, ఫిబ్రవరి 23(విజయ క్రాంతి) :  మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న బి.నిదర్శిని డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే.హుస్సేన్  తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పరిశోధన రంగంలో కళాశాల అధ్యాపకులు ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. పరిశోధనలు వ్యక్తిగతంగా కెరీర్ పరంగా అధ్యాపకులకు చాలా అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బి.నిదర్శిని మాట్లాడుతూ రాజస్థాన్ లోని జగదీష్ ప్రసాద్ జబర్మల్  టిబ్రేవాలావిశ్వవిద్యాలయంలో డాక్టర్ ప్రసాద్ పెద్ది పర్యవేక్షణలో అనాలసిస్ ఆఫ్ డేటా సెలక్షన్ అండ్ డేటా ప్రాసెసింగ్ ఫర్ ఐడెంటిటీ పాటరన్స్ బై డేటా మైనింగ్ టెక్నిక్స్ అనే అంశం పై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ పొందినట్లు తెలిపారు.

స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సింహారెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ శరత్ రెడ్డి, స్టాఫ్  క్లబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ నాగేందర్ రావు, డా.శ్రీలత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.