వైద్యులు.. రైతులయ్యారు
20-03-2026 12:00 AM
భైంసా, మార్చి 19 (విజయక్రాంతి): జిల్లాలో ప్రముఖ స్వప్న మల్టీపర్పస్ హాస్పిటల్ వైద్యులు నాలం స్వప్న శశికాంత్ గురువారం రైతులయ్యారు. ప్రతినిత్యం రోగులకు ఆరోగ్య చికిత్సలు అందించే వైద్యులు ఉగాది పండుగ రోజున తన సొంత వ్యవసాయ పొలంలోకి రైతు వేషంలో పిల్లలతో కలిసి బోనం నెత్తిన పెట్టుకొని పూజలు చేశారు.




