calender_icon.png 22 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతో పాటు సామాజిక స్పృహ అవసరం

21-06-2025 10:39:25 PM

ఎంపీ మల్లు రవి, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి(MP Dr. Mallu Ravi), మాజీ సీబీఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జేఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "పాలమూరు మట్టి మాణిక్యాలు-2025" అవార్డుల ప్రదానోత్సవంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ, సంకల్పబలం, ప్రణాళికాబద్ధమైన అధ్యయనంతో విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చన్నారు.

ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... విద్యార్థులు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండి విద్యతో పాటు సమాజం పట్ల సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, డీఈఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.