18-08-2025 04:50:26 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు గది నిర్మాణం కోసం కాంగ్రెస్ మండల నాయకుడు ఐటిపాముల రవీంద్ర 20వేల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ పాఠశాల అదనపు గది నిర్మాణం కోసం తన వంతు సహాయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రవీంద్ర ను పాఠశాల హెచ్ఎం శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బత్తిని సహదేవు అభినందించారు.