calender_icon.png 18 June, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుకార్లను నమ్మవద్దు

18-06-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, జూన్ 17(విజయక్రాంతి):పాఠశాలలకు పెండింగ్ బిల్లుల డిమాండ్ తాళాలు వేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, సామాజిక మీడియాలో ప్రభుత్వ బడులపై అసత్య ప్రచారం చేసే పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

మంగళవారం ఆమె మాట్లాడుతూ ఖానాపూర్ మం డలంలోని రాజుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల గేటుకు సోమవారం కాంట్రాక్టర్ తాళం వేసి న ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పాఠశాల తెరిపించడం జరిగింద ని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరవుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి అనవసర పుకార్లు, అపోహలు వ్యాపిస్తున్నాయి. పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ద్వా రా గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రజ లు, తల్లిదండ్రులు ఏవిధమైన భయాందోళన లేకుండా విద్యార్థులను పాఠశాలకు పం పాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.