రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
ఇంద్రవెల్లి మండల పర్యటనలో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు ఎంత గానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి, రెవెన్యూ సదస్సులను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దస్నాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యు సదస్సును వైద్య శిబిరాన్ని పరిశీలిం చి, సదస్సుకు వచ్చిన రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పిట్టబొంగరం గ్రామంలో అమర వీరులకు, ఇతర లబ్ధిదారులకు కేటాయించి న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు పరిష్కారంతో పాటు ప్రజలు అందించే గ్యా స్ సిలిండర్, రేషన్ కార్డ్, ఇతరత్రా సర్టిఫికెట్ల దరఖాస్తులను సైతం స్వీకరించడం జరుగుతుందన్నారు. కాస్తులో ఉన్నవారికి భూమి పట్టాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకుంటే పట్టాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




