27 March, 2026 | 2:03 PM

Breaking News

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •  

నమ్మించి రెండు తులాల గొలుసు అపహరణ

18-06-2025 12:00 AM

భైంసా, జూన్ 17 (విజయక్రాంతి): భైం సా పట్టణంలో గుర్తు తెలియని దుండగులు మంగళవారం పోలీసులమని చెప్పి రెండు తులాల గొలుసులు అపహరించినట్టు బాధితురాలు రాజవ్వ తెలిపారు. పట్టణంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి భర్త గోవింద్ తో కలిసి వెళుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాము పోలీసులమని మహిళకు తెలిపారు.

ఇప్పుడే ఇక్కడ మహిళా మెడల నుంచి బంగారం గొలుసు తెంపుకొని పోయారని మీ మెడలో ఉన్న గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సలహా ఇచ్చారు దీంతో ఆమె గొలుసును తీసి పొట్లం కడుతుండగా దాన్ని బలవంతంగా లాక్కొని పారిపోవడంతో వారు లబోదిబోమన్నారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఏఎస్‌ఐ దేవి రావు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి విచారణ జరుపుకున్నారు. బాధితురాలు రాజవ్వ కుంటాల మండలంలోని అంబకటి గ్రామానికి చెందిన మహిళ గా పోలీసులు తెలిపారు.