1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

నమ్మించి రెండు తులాల గొలుసు అపహరణ

18-06-2025 12:00 AM

భైంసా, జూన్ 17 (విజయక్రాంతి): భైం సా పట్టణంలో గుర్తు తెలియని దుండగులు మంగళవారం పోలీసులమని చెప్పి రెండు తులాల గొలుసులు అపహరించినట్టు బాధితురాలు రాజవ్వ తెలిపారు. పట్టణంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి భర్త గోవింద్ తో కలిసి వెళుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాము పోలీసులమని మహిళకు తెలిపారు.

ఇప్పుడే ఇక్కడ మహిళా మెడల నుంచి బంగారం గొలుసు తెంపుకొని పోయారని మీ మెడలో ఉన్న గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సలహా ఇచ్చారు దీంతో ఆమె గొలుసును తీసి పొట్లం కడుతుండగా దాన్ని బలవంతంగా లాక్కొని పారిపోవడంతో వారు లబోదిబోమన్నారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఏఎస్‌ఐ దేవి రావు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి విచారణ జరుపుకున్నారు. బాధితురాలు రాజవ్వ కుంటాల మండలంలోని అంబకటి గ్రామానికి చెందిన మహిళ గా పోలీసులు తెలిపారు.