06-06-2025 12:32:18 AM
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 5 (విజయ క్రాంతి); పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్యాన్ని వెదజల్లే ప్లాస్టిక్ ను నివారించి ప్రతి ఒక్కరు నారా, గుడ్డ సంచులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు.
గురువారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం అనే అంశంపై అవగాహన సదస్సులో పర్యావరణ ఇంజనీర్ బి రవీందర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ చట్టాలు... జిల్లాలో వాటి అమలు, పరిశ్రమలు ప్రజలు వారి దయానందన జీవితాల్లో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ,సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉమ్మడి జిల్లా పరిశ్రమల ప్రతినిధులు, సింగరేణి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.