calender_icon.png 17 June, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి

17-06-2025 12:00:00 AM

నిర్మల్, జూన్ 16 (విజయక్రాంతి):  ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రం గా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిపై శాఖల వారీగా సమీక్షించారు.

అలాగే వానకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ చర్యల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం జరగ కూడదన్నా రు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.