27-06-2025 12:37:11 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి
న్యూఢిల్లీ, జూన్ 26: అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్లాక్బాక్స్లలోని సమాచారాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. జూన్ 24 నుంచి ఏఏఐబీ సాంకేతిక బృందం బ్లాక్బాక్స్ల నుంచి డేటాను వెలికితీ సే ప్రక్రియను ప్రారంభించింది.
‘విమానం ముందు భాగంలో ఉండే బ్లాక్బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సీపీఎం) ను సురక్షిత ంగా వేరు చేశాం. జూన్ 25న మె మొరీ మాడ్యూల్ను విజయవంత ంగా యాక్సెస్ చేసి, అందులోని డే టాను ఏఏఐబీ ల్యాబ్లో డౌన్లోడ్ చేశాం’ అని వివరించింది.
ప్రస్తుతం కాక్పిట్ వా యిస్ రికార్డర్, ఫ్లుటై డే టా రికార్డర్లలోని సమాచారం విశ్లేషణ కొనసా గుతోందని, ఈ ప్ర క్రియ పూర్తయితే ప్రమాద సమయ ంలో అసలేం జరిగిందో స్పష్టంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ఈ విశ్లేషణ ంతో ఉపయోగపడుతుందని, ఇ లాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నివారణ చర్యలకు దోహదపడనుంది.