27-06-2025 12:38:56 AM
ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
రాయ్పూర్, జూన్ 26: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గురువారం తెల్లవారుజామున జవాన్లు, మావోయి స్టులకు మధ్య ఎదురుకాల్పులు చో టుచేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. మృతులను కుతుల్ ఏరియా కమిటీ సభ్యురాలు సీమా, ఎల్వో ఎ స్ సభ్యురాలు లింగేగా గుర్తించారు.
నారాయణ్పూర్ జిల్లా అబూజ్మ డ్ అటవీప్రాంతంలో మావోయిస్టు పార్టీ మాడ్ డివిజన్కు చెందిన నే తలు, సభ్యుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న పోలీస్ ఉ న్నతాధికారులు ఆ ప్రాంతంలో డి స్ట్రి క్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), స్పెషల్ టా స్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) దళాలను భారీ గా మోహరించారు.
జవాన్లు కూం బింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడి.. కాల్పులు ప్రా రంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. రెండువర్గాల మధ్య పావుగంట పాటు భీకర పోరు జరిగింది. జ వాన్ల ధాటికి తాళ లేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ.. దట్టమై న అటవీప్రాంతానికి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు.