calender_icon.png 30 June, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్ ప్రమాద భీమా పథకాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలి

30-06-2025 09:55:44 AM

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి

నాగారం: డ్రైవర్ ప్రమాద బీమా పథకం(Driver's Accident Insurance Scheme) కింద 5 లక్షల రూపాయలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన శీలం శ్రీను అనే డ్రైవర్ గత కొన్ని నెలల క్రితం భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి గోడ మీద పడటంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులకు మాజీముఖ్యమంత్రి కేసీఆర్ 2015 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన డ్రైవర్ ప్రమాద భీమా నుండి మంజూరు అయిన ₹5,00,00 రూపాయల చెక్కును  మాజీ మంత్రి  సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తుంగతుర్తిమాజీశాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా శీలం శ్రీను భార్య పద్మ కు అందజేసారు. అనంతరం మాట్లాడుతూ... ఆనాడు తెలంగాణ అసంఘాటీత కార్మిక సంక్షేమం కోసం, డ్రైవర్ల కోసం తెలంగాణ రాష్ట్ర  తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  డ్రైవర్లకు ప్రమాద భీమా ఏర్పాటు చేశారని అన్నారు రోడ్డు ప్రమాదాల వాటర్లో మునిగి, కరెంటు షాకు తో గాని  అకస్మికంగామరణిస్తే ప్రతిడ్రైవర్,జర్నలిస్ట్, హోంగార్డ్  సోదరులకు ఈ భీమావర్తించేలా కృషి చేసి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక వేసులు బాటు కల్పించారు ఈ  ఎంతో మంది డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోతున్నారు.

 బతికి ఉన్న కాలంలో కూడా జీవిత భీమా కట్టుకోలేని పరిస్థితి వారిది.అలాంటి వారికి   కెసిఆర్ డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని 2015లో వారికి 5 లక్షల ప్రమద భీమా అమలుజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి , నోముల భగత్ హుజూర్నగర్ ఇంచార్జ్ ఒంటెద్దు నరసింహారెడ్డి, బోనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్ రావు, నేవూరి ధర్మేందర్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, .రజాక్, బిఆర్ఎస్ కె.వి నియోజకవర్గం అధ్యకులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్, నాగారం మండల పార్టీ అధ్యక్షులు కల్లట్లపల్లి ఉప్పలయ్య సంకేపల్లి రఘువర్ధన్ రెడ్డి కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి గుండగాని సోమేశ్ తాటికొండ సీతయ్య, తుంగతుర్తి నాయకులు గడ్డం సోమేశ్, జలందర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.