27-06-2025 02:24:29 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : సూర్యాపేట జిల్లాలో డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మెడికల్ కాలేజీ నుండి నిర్వహించిన ర్యాలీని ఎస్పీ నర్సింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని దీనివల్ల తల్లిదండ్రులు కుటుంబాలు బాధపడుతున్నారన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు కనిపించినప్పుడు వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. 100 డయల్ చేసి వివరాలు తెలిపినా వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.
రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది యువత కొత్త ఆనందాల కోసం డ్రగ్స్ బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇన్చార్జి డిడబ్ల్యుఓ రూప , ఆర్డీవో వేణుమాధవ్, తాసిల్దార్ కృష్ణయ్య, డీటీడీవో శంకర్ ,డివైఎస్ఓ రామచంద్రరావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి ప్రసన్న కుమార్, నరసింహ చారి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.