09-06-2025 10:48:08 PM
పెడదోవ పడుతున్న యువత..?
నియంత్రణ అవసరమంటున్న స్థానికులు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణ మరుగుదొడ్లలో బోన్ ఫిక్స్ మత్తు పదార్థాల ఆచూకీ కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్లలో ఈ ప్యాక్ లు విరివిగా కనిపించడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. ఈ బోన్ ఫిక్స్ పదార్థాన్ని గుర్తు తెలియని వారు మత్తు పదార్థంగా వినియోగిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా బస్టాండ్ లో వేల మంది ప్రయాణికులు, స్త్రీలు, పురుషులు ప్రయాణిస్తుంటారని వీటిని మత్తు పదార్థంగా వినియోగించిన వారితో సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుందని స్థానికులు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మేస సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ,పకడ్బందీ పర్యవేక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమాయకుల మాన,ప్రాణాలు కాపాడాలని అభిప్రాయపడ్డారు.