09-06-2025 01:53:08 AM
పట్టుబడ్డ 362 మందుబాబులు
శేరిలింగంపల్లి, జూన్ 8: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 పిఎస్ లిమిట్స్ లో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లు నిర్వహించారు. ఈ తనిఖీలో 362 మం ది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 260 మంది టూ వీలర్స్, 24 మంది త్రీ వీలర్స్, 73 మంది ఫోర్ వీలర్స్, 5 హెవీ వెహికల్స్ వాహనదారులు ఉన్నారు.
అయితే తనిఖీల్లో పట్టుబ డిన పట్టుబడిన వారిలో 21-30 ఏళ్లు ఉన్నవారు 123 మంది కాగా.. 31-40 ఏళ్ల మధ్య లో ఉన్నవారు 141 మంది ఉండగా, 41- 50 మధ్య వయసులో ఉన్నవారు 74 మంది ఉన్నారు. మొత్తం 362 మందిలో అందరూ పురుషులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పట్టుబడిన ప్రతి ఒక్కరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపా రు.
ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కార ణమై ఇతరుల ప్రాణాలు తీస్తే వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిరంతరం నిర్వహిస్తున్నామని.. తాగి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు మరో మారుహెచ్చరించారు.