09-06-2025 01:55:24 AM
అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 08: భూదాన్ కాలనీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీరావి నారాయణరెడ్డి కాలనీ-2 సిపిఐ శాఖ అధ్యక్షులు చిర్ర శేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూదాన్ కాలనీలో గుడిసెలు తీసుకొని నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. అలాగే ఇందిరమ్మ మం జూరు చేయాలన్నారు. 100 ఏండ్లు బ్రతికి ఉండి పేదవాడి గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని.. అధికారంలో ఉన్నా లేకున్నా పేదల ప్రక్షాళ పోరా టాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో వెట్టి చాకిరి విముక్తికై.. అలాగే అనేకమైన భూ పోరాటాలు చేసి..
పేదలకు భూములు పంచామన్నారు. కార్మికుల పక్షాన, కష్టజీవుల పక్షాన, మాట్లాడి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నామని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య కాం గ్రెస్ ప్రభుత్వం ఈ సౌకర్యం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నా యకులు పబ్బతి లక్ష్మణ్, అజ్మేరా హరి సింగ్ నాయక్, వేణుగోపాల చారి, వెంకన్న, పుల్లయ్య, అరుణ, నవనీత, నిరంజన్, కాశి, దేవమ్మ, సుజాత, చిర్రా కవిత తదితరులుపాల్గొన్నారు.