09-06-2025 01:51:08 AM
మహేశ్వరం నియోజకవర్గంపై చల్లని చూపు ఉండాలి కెఎల్ఆర్
కందుకూరు,జూన్ 8 : పోచమ్మ తల్లి ఆశీస్సులు పల్లెలపై ఉండాలని కెఎల్ఆర్ కోరా రు. లేమురులో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చెసిన ఆయనకు నాయకులు ఘనం గా స్వాగతం పలికారు.ఈసందర్బంగా కెఎల్ఆర్ ఫించన్లు,సన్నబియ్యం వస్తున్నాయా అవ్వలు అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ, ఆరోగ్య తెలంగాణ,యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు వచ్చేలా చల్లని దీవెనలు అందించాలని ఆయన వేడుకున్నారు.
గ్రామస్థులంతా కలిసి గుడి నిర్మాణంతోపాటు అ మ్మవారి విగ్రహం ప్రతిష్టించటం సంతోషడాయకమన్నారు.ప్రతి బిడ్డపై శక్తిరూపిణి ఆశీస్సులు ఉండి యువతకు ఉద్యోగ,ఉపాధి దొరికేలా చూడాలని కెఎల్ఆర్ వేడుకున్నా రు. కల్యాణం,బోనాలను గ్రామస్థులంతా కలిసి ఓపండుగలా జరుపుకోవటం పల్లె ఐ క్యతకు నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం,సిఎం రేవంత్ రెడ్డిపై పోచమ్మ తల్లి దయ ఉండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కెఎల్ఆర్ కోరుకున్నారు.ఈసందర్భంగా ఆల య కమిటీ సభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో డిల్లి శ్రీధర్, మూల హనుమంత్ రెడ్డి,రాణా ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.