08-12-2025 12:37:28 AM
-పట్టుబడ్డ 426 మంది మందు బాబులు
శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.శనివారం రాత్రి 16 పిఎస్ లిమిట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 426 మంది మద్యం సేవించిన వారు చిక్కారు.
ఇందులో 323 టూ వీలర్స్, 17 త్రీ వీలర్స్,85 ఫోర్ వీలర్స్, 1 హెవీ వెహికల్స్ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు,ఇతరుల ప్రాణాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.